లాక్ డౌన్ వేళ హైదరాబాద్ నగరంలో ఒక రౌడీ షీటర్ రెచ్చిపోయాడు. కత్తితో ఒక రైల్వే ఉద్యోగి పై దాడి చేసాడు. ఈ ఘటన సికింద్రాబాద్ పరిధిలోని మెట్టుగూడ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మెట్టుగూడలో రౌడీషీటర్ భాగ్యరాజ్ మద్యం మత్తులో వీరంగం చేశాడు. 

 

రాకేష్ అనే రైల్వే ఉద్యోగిపై దాడికి చేసాడు. అక్కడ ఉన్న స్థానికులు వెంటనే గమనించి తీవ్రగాయలపాలైన రాకేష్‌ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో అతను చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. ఇక అతనిని పట్టుకోవడానికి వచ్చిన పోలీసులపై కూడా రౌడీ షీటర్ దాడి చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: