ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మన పాలన మీ సూచన సదస్సులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి తీరతామని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావడం ఆలస్యమైనా సాధించి తీరడం మాత్రం పక్కా అని చెప్పారు. మనం చెప్పే మాటల్లో నీతి, నిజాయితీ ఉండాలని ఆయన అన్నారు. రాష్ట్రానికి టీడీపీ విదేశీ సంస్థలు వస్తున్నాయని టీడీపీ అబద్ధపు ప్రచారం చేసిందని అన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా తాను అబద్ధాలు చెప్పనని అన్నారు. 
 
మాట ఇచ్చిందే చేస్తామని జగన్ అన్నారు. గత ప్రభుత్వ 40 లక్షల ఉద్యోగాలంటూ అబద్ధపు ప్రచారాలు చేసిందని తెలిపారు. గత ప్రభుత్వం పరిశ్రమల కోసం 20,000 కోట పెట్టుబడులు అంటూ ప్రచారం చేసింది అని అన్నారు. మౌలిక సదుపాయాల విషయంలో ఏపీకి ప్రత్యేక బలాలు ఉన్నాయని సీఎం జగన్ అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: