ఏడాది పాలన పూర్తి అయిన సందర్భంగా సిఎం వైఎస్ జగన్ పారిశ్రామిక వేత్తలతో మేధోమధన సదస్సుని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గత ప్రభుత్వ పని తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. గత ప్రభుత్వం అబద్దాలు చెప్పి నిజాలు చెయ్యాలని చూసిందని ఆయన మండిపడ్డారు.
గత ప్రభుత్వంలో విద్యుత్ డిస్కం లకు 20 వేల కోట్ల బకాయిలను పెట్టారు అని సిఎం జగన్ ఆరోపించారు. ఇక ఎపీకి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే పరిశ్రమలకు రాయితీలు వచ్చేవి అని జగన్ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఈ రోజు కాకపోయినా అరేపు అయినా వస్తుందని తాము మాత్రం హోదా అడగడం మాత్రం మానుకునే అవకాశం లేదని జగన్ అన్నారు. తాను గత ప్రభుత్వంలా అబద్దాలు చెప్పను అన్నారు జగన్.