ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో వైసీపీ ఏడాది పాలన పూర్తైన సందర్భంగా మన పాలన మీ సూచన సదస్సులో భాగంగా సదస్సు నిర్వహించారు. సీఎం జగన్ మాట్లాడుతూ తాను నిజాయతీ, నిబద్ధతతో వ్యవహరిస్తానని... చంద్రబాబులా తాను అబద్ధాలు చెప్పలేనని తెలిపారు. టీడీపీ 20,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 40 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి మాట తప్పిందని సీఎం అన్నారు. 
 
దేశంలో ఎక్కడా లేని విధంగా జ్యూడీషియల్ ప్రివ్యూ కమిటీ ఏర్పాటు చేశామని... రాష్ట్రంలో రివర్స్ టెండరింగ్ ను ప్రవేశపెట్టామని తెలిపారు. పరిశ్రమలకు నీరు ఇచ్చేందుకు రాష్ట్రంలో బలమైన వ్యవస్థ ఉందని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ కొరత లేదని... పరిశ్రమలకు భూములు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం జగన్ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: