తాను గ్రాఫిక్స్ చూపించి అన్యాయం చేయలేను అని సిఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. కేంద్రంలో ఉన్న వారు ఏదోక రోజు మన మీద ఆధారపడే పరిస్థితి వస్తుందని జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో 4 వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పుకున్నారు అని అది మీడియాను మ్యానేజ్ చేయడమే అని మండిపడ్డారు. 

 

ప్రత్యేక హోదా నినాదాన్ని తాము విడిచి పెట్టే అవకాశం లేదని జగన్ స్పష్టం చేసారు. రివర్స్ టెండరింగ్ విధానాన్ని ప్రవేశ పెట్టామని అన్నారు. పరిశ్రమలకు భూములు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని జగన్ అన్నారు. 75 శాతం రిజర్వేషన్ లు ఇస్తామని చెప్తే చాలా మంది అర్ధం చేసుకోలేదు అని జగన్ ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: