ఆంధ్రప్రదేశ్ లో కంపెనీలకు మంచి వాతావరణం ఉందని తాము భూములు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామని సిఎం జగన్ అన్నారు. అబద్దాలు చెప్పడంలో చంద్రబాబు నిపుణుడు అంటూ జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కంపెనీలు పెట్టే వారు ముందుకు రావాలని తాము అన్ని విధాలుగా రాయితీలు కల్పిస్తామని జగన్ పేర్కొన్నారు. 

 

రు.11000 కోట్ల‌తో కంపెనీలు పెట్టుబ‌డులు పెడుతున్నాయని మ‌రో 20 కొత్త కంపెనీలు వస్తున్నాయని  జగన్ అన్నారు. ప్రస్తుతం ఏపీలో 34 వేల కొత్త ఉద్యోగాలను తాము ఇచ్చామని సిఎం జగన్ అన్నారు. నిజాయితీ గా తాను ఏది చేస్తానో అదే చెప్తా అని జగన్ పేర్కొన్నారు. హోదా వచ్చి ఉంటే కచ్చితంగా పరిశ్రమలకు రాయితీలు వచ్చేవి అని జగన్ అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: