అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగిన జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా మరో కొత్త నిర్ణయానికి నాంది పలికిన విషయం తెలిసిందే. మన పాలన మీ సూచన అనే సదస్సును నిర్వహిస్తోంది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి సర్కార్. ఇక ఈ సదస్సులో భాగంగా తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ సందర్భంగా అధికారంలోకి వచ్చిన తర్వాత తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి చెబుతూనే గత ప్రభుత్వ అసమర్థతను కూడా ఎండకడుతున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 

 


 ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్ కు తీరని అన్యాయం జరిగింది అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రం విడిపోయాక అధికారంలోకి వచ్చినా టిడిపి పార్టీ కారణంగా రాష్ట్రం అభివృద్ధి కుంటుపడింది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. కేవలం రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి గురించి గ్రాఫిక్స్ చూపించి కేవలం మాటలతో మాత్రమే సరి పెట్టారని... చేతలు చేసి చూపించిన దాఖలాలు మాత్రం ఎక్కడా లేవు అంటూ వ్యాఖ్యానించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: