రెండో రోజు మహానాడు సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ అరాచకాలు చేస్తుందని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీ తో సహా తిరిగి చెల్లిస్తామని చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రశ్నిస్తే టీడీపీ నేతలపై దాడులు చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని, సోషల్‌ మీడియాలో ప్రశ్నిస్తున్న తటస్థులపై కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. 

 

స్థానిక ఎన్నికల నామినేషన్లలో పోలీసులు అధికారపార్టీకి తొత్తులుగా మారారు అంటూ ఆయన కాస్త ఘాటు వ్యాఖ్యలు చేసారు. జిల్లాల్లో పర్యటించాలంటే సీఎం జగన్‌ అనుమతి కావాలా?  అని నిలదీశారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చంద్రబాబు నాయుడు  సూచించారు. దాడులు, దోపిడీలకు సీఎం సలహాదారు వ్యూహ రచన చేస్తున్నారని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: