ఒక పక్క కరోనా వైరస్ తో జాగ్రత్తగా ఉండాలని సూచించినా సరే కొందరు మాత్రం మాట వినడం లేదు. ఇప్పుడు దీనిపై చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఎన్ని జాగ్రత్తలు సూచించినా సరే కొందరి తీరు మారకపోవడం ఇప్పుడు భయపెట్టే విధంగా ఉంది. తాజాగా కర్నూలులో ఒక ప్రభుత్వ ఆస్పత్రి నుంచి కరోనా బాధిత మహిళ పారిపోయింది. 

 

ఆమెను కోడుమూరు మండలంలో ఆర్టీసి బస్సులో గుర్తించి పట్టుకున్నారు అధికారులు. దీనితో ఒక్కసారిగా ఆ బస్సులో ఉన్న వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె దగ్గరగా కూర్చున్న చాలా మంది  ఇప్పుడు హోం క్వారంటైన్ లో ఉన్నట్టు సమాచారం. దీనిపై అధికారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రవర్తన నాశనం చేస్తుంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: