ఆంధ్రప్రదేశ్ లో డాక్టర్ సుధాకర్ వ్యవహారం ఇప్పట్లో చల్లారే అవకాశాలు కనపడటం లేదు. నిన్న తనకు మానసిక రోగులకు ఇచ్చే మందులు ఇస్తున్నారని లేఖ రాసి సంచలనం సృష్టించిన డాక్టర్ సుధాకర్ ఇప్పుడు హైకోర్ట్ లో అడుగు పెట్టారు. విశాఖ మానసిక ఆస్పత్రిలో వైద్యం సరిగా అందడంలేదని, తనను వెంటనే వేరే ఆస్పత్రికి తరలించాలని సుధాకర్ హైకోర్ట్ ని కోరారు.
కోర్టు పర్యవేక్షణలో వైద్యం జరపాలని సుధాకర్ కోర్టులో పిటీషన్ లో కోరారు. ప్రభుత్వం తనకు సరైన వైద్యం అందించడంలేదన్న ఆయన ట్యాబ్లెట్ల వివరాలను ఆయన తనకు పిటిషన్లో పేర్కొన్నారు. వైద్యులు ఇస్తున్న ట్యాబ్లెట్ల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని పిటీషన్ లో పేర్కొన్నారు. ఆయన పిటీషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.