దేశంలో రోజు రోజుకీ కరోనా వైరస్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. దేశంలో మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు లో కరోనా అంతకంత పెరిగిపోతుంది. 20 వేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. తమిళనాడులో ఈ రోజు కొత్తగా 827 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19372 కు చేరింది. అదే విధంగా ఈ రోజు తమిళనాడులో కరోనా చికిత్స పొందుతూ 12 మంది మరణించారు. ఈ మద్య చెన్నైలో ప్రముఖ నటుడు లారెన్స్ నడుపుతన్న ట్రస్ట్ లో 20 మందికి కరోనా పాజిటీవ్ వచ్చిన విషయం తెలిసిందే.
చెన్నైలోనే ఎక్కువ కేసులు పెరిగిపోతున్నట్లు సమాచారం. ఇక్కడ మొత్తం మరణాల సంఖ్య 145 కు చేరింది. తమిళనాడు రాజధాని చెన్నై నగరంలోనే 559 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 639 మంది డిశ్చార్జ్ అవ్వగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య మొత్తం 10548 కు చేరుకుంది. అత్యధిక జన సాంద్రత ఉండే చెన్నైలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 12762 కు చేరింది.