లాక్ డౌన్ లో అసలే జనాలు ఇబ్బంది పడుతున్న వేళ సైబర్ నేరగాళ్ళు జనాలను గుల్ల చేస్తున్నారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఎక్కడో ఒక చోట ఏదోక నేరం జరుగుతూనే ఉంది. ఎవరికి వారుగా జాగ్రత్తలు తీసుకుని తమ సొమ్ముని భద్రంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నా అది మాత్రం నేరగాళ్ళ చేతిలో చిక్కుతునే ఉంది.
ఇక హైదరాబాద్ లో నిన్న ఒక్క రోజే వేర్వేరు ఘటనలలో 12 లక్షల రూపాయలను నోక్కేసారు సైబర్ నేరగాళ్ళు, గిఫ్ట్ లు అని చెప్పడం ఆ తర్వాత ఓటీపీ లు అడగడం ఆఫర్లకు కక్కుర్తి పడి చెప్పడం ఇలాంటి సంఘటనలతో ఇప్పుడు డబ్బులు పోగొట్టుకుంటున్నారు చాలా మంది. దీనిపై హైదరాబాద్ పోలీసులు ట్వీట్ చేస్తూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
Beware of Cyber Crimes #Gifts #olx #friendrequest pic.twitter.com/3PhG9qK1dV
— hyderabad City police (@hydcitypolice) May 29, 2020