ఒడిశాలో విషాద ఘటన చోటు చేసుకుంది. హోం క్వారంటైన్ లో వలస కార్మికుడు  ప్రాణాలు కోల్పోయాడు. రాష్ట్రంలోని మయూర్‌భంజ్ జిల్లాలో నహాందషోలా పంచాయితీ పరిధిలోని భాలుబసా గ్రామానికి చెందిన పరేష్ చంద్ర మహంత గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో ఒక హోటల్ లో వంట పని చేస్తూ జీవనం సాగించే వాడు. 

 

లాక్ డౌన్ తో హోటల్ ని మూసి వేసారు. దీనితో సొంత గ్రామానికి వచ్చాడు. కరోనా హాట్ స్పాట్ నగరం నుంచి వచ్చిన నేపధ్యంలో గరుడబసా గ్రామంలోని ఆదర్శవిద్యాలయలో క్వారంటైన్ లో ఉంచారు అధికారులు. 7 రోజుల క్వారంటైన్ అనంతరం పరేష్ చంద్రను హోంక్వారంటైన్ చేయగా... అతను అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. తన భర్తకు కరోనా ఉందని... అతను అందుకే అతను ఆత్మహత్య చేసుకున్నాడని అతని భార్య పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: