తమిళనాడు కి చెందిన ఒక మంత్రి కన్నీరు పెట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే పాఠశాల విద్యాశాఖ తరగతి గదుల గురించి విద్యార్థులకు తెలియజేసేలా విధంగా ‘వగుప్పరై నోక్కిన్‌’ అనే మొబైల్‌ యాప్‌ను తీసుకొచ్చారు. డీపీఐ కార్యాలయంలో ఈ యాప్‌ పరిచయ కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ మంత్రి కేఏ సెంగోట్టయన్‌ కంటతడి పెట్టారు. 

 

దేశంలోనే విద్యారంగంలో తమిళనాడులో పలు మార్పులను చేపట్టామన్న ఆయన... విద్యారంగానికి తమ ప్రభుత్వం రూ.34 వేల కోట్లను కేటాయించిందని చెప్పారు. విద్యాశాఖలో పలువురు ఈ నెలాఖరులో పదవీవిరమణ చేయనున్నారని చెప్తూ ఆయన కన్నీరు పెట్టుకున్నారు. అయితే ఆయన ఎందుకు కన్నీరు పెట్టుకున్నారు అనేది అక్కడ ఉన్న ఎవరికి అర్ధం కాలేదు. అయితే అధికారులు ఆయనను ఓదార్చారు. ఈ వీడియో అక్కడ బాగా వైరల్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: