హైకోర్ట్ న్యాయాన్ని నిలబెట్టింది అని ఏపీ బిజెపి నేత కామినేని శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వం చేస్తున్న తప్పులకు అధికారులు బలికావడం బాధాకరమని ఆయన అన్నారు. దేశం మొత్తం కూడా హర్షం వ్యక్తం చేసే తీర్పు ఇది అని ఆయన అన్నారు.  ఇటీవలి కాలంలో ఎన్నడు చూడని సంక్షోభం ఇది అని స్పష్టం చేసారు.

 

రాజ్యాంగ వ్యవస్థలపై హైకోర్ట్ నమ్మకం నిలబెట్టింది అని అన్నారు. ప్రభుత్వ స్థాయిలో చేస్తున్న అన్యాయాన్ని అడ్డుకుని హైకోర్ట్ న్యాయాన్ని నిలబెట్టింది అని ఆయన పేర్కొన్నారు. హైకోర్ట్ తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కావాలని ఆయన హైకోర్ట్ వెలుపల మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. చట్ట వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ని హైకోర్ట్ కొట్టేసిందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: