ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో సరి కొత్త ప్రాజెక్టులు నిర్మితమవుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ సర్కార్ అధికారంలోకి వచ్చి... కాళేశ్వరం అనే మహత్తర ప్రాజెక్టును నిర్మించి పూర్తి చేసి సంచలనం సృష్టించింది. 

 


 అయితే తాజాగా రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టుల గురించి మీడియా సమావేశం నిర్వహించిన  ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో భవిష్యత్తులో నిర్మించబోయే మరిన్ని ప్రాజెక్టుల గురించి కూడా చెప్పుకొచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం దగ్గర సీతమ్మ సాగర్ ప్రాజెక్టు నిర్మించబోతున్నట్లు తెలిపారు. 35 టీఎంసీల ఈ ప్రాజెక్టు నిర్మితమవుతుందని  వెల్లడించారు. మరో ఏడు టిఎంసిల సామర్థ్యం తో సమ్మక్క సారక్క సాగర్ దేవాదుల దగ్గర కూడా మరో ప్రాజెక్టు నిర్మించబోతున్నట్లు చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: