తెలంగాణాలో కరోనా  కేసులు రోజు రోజుకి పెరుగుతున్న నేపధ్యంలో అక్కడి పోలీసులు కూడా చాలా వరకు జాగ్రత్తలు పడుతున్నారు కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిపై ఇప్పుడు కాస్త సీరియస్ గానే ఉన్నారు అధికారులు. ఎవరిని కూడా లోనికి ఏ అనుమతి లేకుండా అనుమతించవద్దు అని భావిస్తున్నారు. 

 

ఇక తాజాగా పోలీసులు ఒక ప్రకటన విడుదల చేసారు. తెలంగాణా రాష్ట్రంలోకి ప్రవేశించడానికి గానూ , దయచేసి 040-23450624 / 23450019 కాల్ లేదా tsgadcontrol@gmail.com కు మెయిల్ చెయ్యాలి అని అధికారులు సూచించారు. దయచేసి పోలీసుల సూచనలు పాటించి అప్పుడు రాష్ట్రంలోకి అడుగు పెట్టాలని సూచించారు. కాగా నిన్న ఒక్క రోజే తెలంగాణాలో 117 కేసులు నమోదు అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: