గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యం తో బాధపడుతున్న చత్తీస్ఘడ్ మాజీ సిఎం అజిత్ జోగి కన్ను మూశారు. ఆయన కొన్ని రోజులుగా శ్వాస సంబధిత వ్యాధితో బాధపడుతూ ఆ రాష్ట్ర రాజధాని లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆస్పత్రిలో చేరిన నాటి నుంచి కోమాలోనే ఉన్నారు. 

 

ఆయనకు అప్పటి నుంచి కూడా ప్రత్యేక వార్డు లో చికిత్స అందిస్తున్నారు. ఆయనకు గిరిజనుల్లో బలమైన నేతగా మంచి పేరు ఉంది. 2000 నుంచి 2003 వరకు ఆ రాష్ట్ర సిఎం గా పని చేసారు. రాయపూర్ లోని ఒక విద్యాలయంలో ఆయన ఉన్నత విద్యను అభ్యసించారు. కాగా ఆయన వయసు 74 ఏళ్ళు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ అధిష్ట్యానం సంతాపం ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: