టాలీవుడ్ లో నటి పూనమ్ కౌర్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆమె నటించిన చిత్రాలు చాలా తక్కువే అయినా ఆ చిత్రాలు మంచి హిట్ అందుకున్నాయి. అంతే కాదు అప్పడప్పుడు సోషల్ మీడియాలో తన కాంట్రవర్సీ మాటలతో హల్ చల్ చేస్తుంది. నిన్న ఎవ్వరూ లేని సమయంలో ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి సీనియర్ ఎన్టీఆర్ కి నివాళులర్పించింది.  తాాజాగా సైబరాబాద్ పోలీసులకు 100 ప్రత్యేకమైన మాస్కులను బహూకరించారు. ఇవాళ పూనమ్ కౌర్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి వెళ్లి సీపీ సజ్జనార్ ను కలిశారు. 

తర్వాత  సజ్జనార్ కు సిక్కుల మతగురువు గురు గోవింద సింగ్ చిత్రపటాన్ని జ్ఞాపికగా అందించారు.  ఈ సందర్బంగా సోషల్ మాద్యమంలో పోస్ట్ చేస్తూ.. తాను చిత్రపటాన్ని అందిస్తున్న సమయంలో పోలీస్ కమిషనర్ సజ్జనార్ బూట్లు తీసేసి ఎంతో భక్తిభావం ప్రదర్శించారని, అది భారతీయ సంస్కృతికి నిదర్శనం అని పూనమ్ కౌర్ కొనియాడారు. నిజంగా తెలంగాణలో పోలీస్ వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉందని.. నేరాలు చేసేవారికి కఠిన శిక్షలు వెంటనే వేస్తున్నారని పొగిడారు.  ఈ ఘటనతో పోలీస్ అంటే గౌరవం రెట్టింపైందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సజ్జనార్ తో ఆమె సెల్ఫీ తీసుకుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: