ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో హైకోర్ట్ ఇచ్చిన తీర్పు పై ఇప్పుడు వైసీపీ నేతల్లో అసహనం వ్యక్తమవుతుంది. అంబటి రాంబాబు ఇప్పటికే ఏపీ హైకోర్ట్ ఇచ్చిన తీర్పుని సుప్రీం లో సవాల్ చేస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా స్పీకర్ తమ్మినేని సీతారం కీలక వ్యాఖ్యలు చేసారు. ఒక వ్యవస్థను ఇంకో వ్యవస్థ అడ్డుకోవడం సరికాదు అని తమ్మినేని అన్నారు. 

 

పాలనా వ్యవస్థను న్యాయవ్యవస్థ శాసించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి మరో వ్యవస్థ హద్దులు దాటి నియంత్రించాలి అనుకోవడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల్లో రాజ్యంగా వ్యవస్థల హద్దులపై చర్చ జరుగుతుందని ఈ వ్యవస్థలపై విస్తృతంగా చర్చ జరగాల్సి ఉందని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: