అమెరికా చైనా మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న సమయంలో భారత్ చైనా సరిహద్దుల్లో కూడా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ సమయంలో భారత్ తో చైనాకు ఉన్న సరిహద్దు సమస్యలకు సంబంధించి తాను మధ్యవర్తిత్వం వహిస్తా అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఒక ఆసక్తికర ప్రకటన చేసారు. ఇది చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. 

 

ఆ దేశంలో కరోనా వైరస్ తో జనాలు బాగా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆయన ఆసక్తికర ప్రకటన చేసారు. దీనిపై చైనా స్పందించింది. కొన్ని రోజుల కొనసాగుతున్న సరిహద్దు సమస్యపై మధ్యవర్తిత్వం వహించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదన అవసరం లేదని భారత్ చైనా మధ్య మూడో దేశ జోక్యం అవసరం లేదని చైనా తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: