తెలంగాణాలో కరోనా వైరస్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది గాని తగ్గే అవకాశాలు ఎక్కడా కనపడటం లేదు. ప్రస్తుతం తెలంగాణాలో ఆందోళనకర స్థితిలోనే ఉంది. హైదరబాద్ నగరంలో భారీగా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. రెండు రోజుల నుంచి వందకు పైగా కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. 

 

ఇక తాజాగా కరోనాపై మాట్లాడిన ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేంద్ర కీలక వ్యాఖ్యలు చేసారు. కరోనాను ఆపే శక్తి ప్రభుత్వాలకు లేదని అది ఇప్పట్లో పోయేది కాదని ప్రజలు దాన్ని లైట్ తీసుకోవద్దు అని ఆయన హెచ్చరించారు. ఎవరికి వారుగా జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం కరోనా వైరస్ ని ఎదుర్కోవడం చాలా కష్టం అని ఈటెల రాజేంద్ర చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: