ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే భారీగా పిడుగులు కూడా పడుతున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో వంగర మండంలో పిడుగు పాటుకి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. గీతనా పల్లిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా శ్రీహరిపురంలో మరొకరి పిడుగుపాటుకి ప్రాణాలు కోల్పోయారు. ఇక ఏపీలో రెండు జిల్లాలకు పిడుగు పాటు హెచ్చరికలు చేసారు అధికారులు. 

 

ప్రకాశం జిల్లా చిత్తూరు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని కాబట్టి చెట్ల కింద ఉండవద్దు అని అధికారులు సూచించారు. రెండు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని సూచనలు చేసారు. కాగా ఈ రెండు జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: