గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో వరుసగా భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. అక్కడ ప్రజలు ఎక్కడ భూకంపం సంభవిస్తుందని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఇప్పటికే ఒక నెలలో రెండు మూడు సార్లు భూకంపాలు సంభవించాయి. ఇక తాజాగా మరోసారి దేశ రాజధాని ఢిల్లీలో భూకంపం సంభవించింది. 

 

 హర్యానాలో 4.6 మాగ్నిట్యూడ్ భూకంపం తర్వాత... తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో కొన్ని  సెకండ్ల పాటు బలమైన ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాసేపు ఏం జరుగుతుందో అని అర్థం కాని పరిస్థితి నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: