దేశ వ్యాప్తంగా వలస కూలీలు పడుతున్న కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వారికి అండగా నిలబడే వారే కరువు అయ్యారు. వారి బాధలు  వారి ఆవేదన గురించి ఇప్పుడు ప్రపంచం కూడా ఆవేదన వ్యక్తం చేస్తుంది. తాజాగా దీనిపై ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ రాసారు. 

 

“బండరాళ్లని పిండి చేసిన చేతులు ఎడమపక్క డొక్క నొప్పికి లొంగిపోయాయి. పెద్ద పెద్ద ఇనుప చువ్వలని వంచిన వేళ్ళు మెత్తని పేగుల ముందు ఓడిపోయాయి. మేం వేసిన రోడ్లే మమ్మల్ని వెక్కిరిస్తుంటే బతకడం కోసం ఊరొదిలొచ్చిన మేము చచ్చేలోపు ఊరెళితే చాలనుకుంటూ.. ఆకలి అడుగులతో.. పేగులు అరుపులతో.. కాళ్లు, కడుపు ఒకేసారి కాలుతుంటే .. మమ్మల్ని చూసే లోకులకి బాధేస్తోంది.. జాలేస్తోంది.. కానీ మాకు మాత్రం ‘ఆకలేస్తోంది’!! నిస్సహాయతతో..’’ అని హరీష్ రాసారు. దీనిని దేవిశ్రీ ప్రసాద్ షేర్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: