దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. దాదాపు నిన్న దేశ వ్యాప్తంగా 8 వేల కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు ఈ స్థాయిలో కరోనా కేసులు దేశ వ్యాప్తంగా ఇదే స్థాయిలో నమోదు అవ్వడం తొలిసారి. 24 గంటల్లో 8,105 కేసులు నమోదు అయ్యాయి. 269 మంది నిన్న ఒక్క రోజే ప్రాణాలు కోల్పోయారు. 

 

ఇక దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 1,73,491 గా ఉన్నాయి. 4,980 మంది ఇప్పటి వరకు మరణించారు. 82,627 మంది పూర్తిగా కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు ఈ స్థాయిలో నమోదు కావడం గత 24 గంటల్లో 8 వేల కేసులు రావడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: