ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ రోజు రోజుకి పెరుగుతుంది. తాజాగా ఏపీ సచివాలయంలో కూడా కరోనా కేసు బయటపడింది. నాలుగు రోజుల క్రితం తెలంగాణా నుంచి ఒక ఉద్యోగి అమరావతి సచివాలయానికి రాగా అతనిని ఆస్పత్రికి తరలించారు. డిపార్ట్ మెంట్ ఆఫ్ ప్రోటో కాల్ అపార్ట్మెంట్ లో అతను నివాసం ఉంటున్నాడు. 

 

దీనితో అతని తో పాటు బస్సులో వచ్చిన అందరికి పరిక్షలు చేస్తున్నారు హైదరాబాద్ లో లాక్ డౌన్ తో రెండు నెలలుగా చిక్కుకున్న ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ కి తీసుకొచ్చే విధంగా అనుమతి ఇవ్వాలని ఏపీ సిఎస్ నీల౦ సహాని తెలంగాణా సిఎస్ కి లేఖ రాసారు. ఆయన అనుమతి ఇవ్వడం తో ప్రత్యేక బస్సులను ఏపీ నుంచి హైదరాబాద్ కి పంపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: