కరోనా వైరస్ లేదు అనుకున్న ప్రకాశం జిల్లాలో క్రమంగా కరోనా కేసులు బయటపడటం ఆందోళన కలిగిస్తుంది. ప్రకాశం జిల్లాలో ఎక్కడో ఒక చోట కేసు నమోదు అవుతూనే ఉంది. ఇక ప్రకాశం జిల్లా ఒంగోలు లో కరోనా కేసు నమోదు అయింది. విజయవాడ నుంచి అతన్ని ఈ నెల 12 ఒంగోలు జైలు కి తీసుకుని రాగా అతనికి కరోనా పాజిటివ్ వచ్చింది. 

 

అతనికి కరోనా ఏ విధంగా సోకింది అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. అతన్ని జైలుకి తీసుకొచ్చిన ఖైదీ పోలీసులు అందరికి కూడా కరోనా పరిక్షలు చేస్తున్నారు. ప్రస్తుతం జైలులో ఉన్న ఖైదీలు అందరికి కరోనా పరిక్షలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: