జమ్మూ కాశ్మీర్ కుల్గాం జిల్లాలోని వాన్‌పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఈరోజు ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీస్, ఆర్మీ, సిఆర్‌పిఎఫ్ సంయుక్త బృందం నిర్వహిస్తునున్న ఈ ఆపరేషన్ లో ఇద్దరు ఉగ్రవాదులను కాల్చి చంపారు. ఇక వారి దగ్గరి నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 

 

అక్కడ ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నారు అనే సమాచారం రావడం తో గాలింపు చర్యలను కొనసాగిస్తున్నట్టు  జమ్మూ కాశ్మీర్ పోలీసులు మీడియాకు వివరించారు. ఇక జమ్మూ కాశ్మీర్ లో ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. నిన్న ఒక ఉగ్రవాదిని కాల్చి చంపాయి బలగాలు. ఇక అక్కడ ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నారు అనే సమాచారంతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. మరో ఉగ్రవాది ఆచూకి కోసం గాలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: