ఏడాది పాలన సందర్భంగా సిఎం వైఎస్ జగన్ రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. కులాలు, మ‌తాలు, వ‌ర్గాలు చూడ‌కూడ‌దని ఆ విధంగానే తాను పరిపాలన చేశా అని జగన్ చెప్పారు. నాకు ఓట్లేయ‌ని వారికి కూడా ప‌నులు చేశానని ఆయన వివరించారు. తాను ఇచ్చిన హామీలు అన్నీ కూడా నెరవేర్చా అని జగన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. 

 

కులాలు మతాలు వర్గాలు చూడకుండా పథకాలు అమలు చేసామని అన్నారు. ఇచ్చిన అన్ని హామీలు కూడా అమలు చేయడానికి తాను కృషి చేస్తున్నా అన్నారు జగన్. 129 హామీలు ఇచ్చి 77 ఇప్పటికే అమలు చేసామని అన్నారు. మిగిలిన హామీలు కూడా అమలుకి సిద్దంగా ఉన్నాయన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: