ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా  ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మాట్లాడిన సిఎం జగన్... కీలక వ్యాఖ్యలు చేసారు. ఇచ్చిన హామీలు 129... అమ‌ల్లోకి వ‌చ్చిన‌వి – 77 అని ఆయన స్పష్టం చేసారు. ప్రారంభోత్స‌వానికి డేట్ ఖరారు అయిన‌వి 36 అని జగన్ పేర్కొన్నారు. మ‌రో 16 త్వ‌ర‌లోనే అమ‌లు చేస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేసారు. 

 

గత ప్రభుత్వంలో లంచం లేనిదే ఏ ఒక్కటి జరిగేది కాదని అన్నారు ఆయన. పించన్ ని ప్రతీ నెల 1 న కచ్చితంగా అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఏడాది కాలంలో ఎలాంటి మార్పులు జరిగాయో మీ మనస్సాక్షి ని అడగాలి అని జగన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. నాడు నేడు ద్వారా స్కూల్స్ ని అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: