ఏడాది పాలన పూర్తి అయిన సందర్భంగా సిఎం వైఎస్ కీలక వ్యాఖ్యలు చేసారు. గత ప్రభుత్వం ఘనకార్యాలను ఆయన సందర్భంగా వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు సర్కార్ చేసిన అప్పులను జగన్ బయటకు చెప్పారు. భారీగా వడ్డీలు అయ్యాయి అని అన్నారు. గత ప్రభుత్వ బకాయిలు 2.60 లక్షల కోట్లని చెప్పారు జగన్.
వడ్డీలే రు. 20 వేల కోట్లు అయ్యాయి అని అన్నారు. గత ప్రభుత్వం 39 వేల కోట్ల చెల్లింపులు చేయకుండా బకాయిలు ఉంచింది అని జగన్ ఈ సందర్భంగా ఆరోపించారు. గత ప్రభుత్వంలో మద్యం విచ్చల విడిగా అమ్మే వారు అని జగన్ ఆరోపించారు. అంతా దళారి వ్యవస్థ ఉండేది అని ఆయన ఆరోపణలు చేసారు.