తెలుగుదేశం పార్టీ హయాంలో జన్మభూమి కమిటీలదే రాజ్యం అని ఏపీ సిఎం వైఎస్ జగన్ ఆరోపించారు. ఏది కావాలన్నా సరే గత ప్రభుత్వంలో వారినే అడగాల్సి వచ్చేది అని ఆయన విమర్శించారు. తమా ప్రభుత్వంలో అలాంటి వ్యవస్థ లేదని చెప్పుకొచ్చారు ఆయన. గత ప్రభుత్వంలో గుడి దగ్గర బడి దగ్గర బెల్ట్ షాపులు కనపడేవి అన్నారు. 

 

గ్రామ సచివాలయాల ద్వారా అన్ని కార్యక్రమాలను అందిస్తున్నామని అన్నారు. పేదలకు అండగా తమ ప్రభుత్వం ఉందని జగన్ పేర్కొన్నారు. అన్ని సామాజిక వర్గాలకు తాము న్యాయం చేసామని అన్నారు. అర్హులు అయిన 29 లక్షల మందికి ఇళ్ళ పట్టాలను ఇస్తామని జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రతీ పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలను అందిస్తామని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: