ఏడాది పాలన సందర్భంగా సిఎం వైఎస్ జగన్ గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వివరించారు. గత ప్రభుత్వంలో ఏది కావాలి అన్నా సరే లంచాలు ఇచ్చే పరిస్థితి ఉందని ఆయన పేర్కొన్నారు. పించన్ రావాలి అన్నా సరే లంచం ఇవ్వాలని అన్నారు. అలాగే ఏ సంక్షేమ కార్యక్రమం కోసం అయినా కొంత వసూలు చేసే పరిస్థితి ఉందని ఆయన అన్నారు. 

 

బాత్ రూమ్‌కు రు. 3 వేలు... బీమాకు రు. 20 వేలు.. ఇళ్లుకు రు.15 వేలు వసూలు చేసారని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వం అప్పులు చేసి వెళ్ళింది అని తాము ఇప్పుడు వాటికి వడ్డీలు కడుతున్నామని జగన్ అన్నారు.  వేల కోట్ల రూపాయల బకాయిలను చంద్రబాబు సర్కార్ ఉంచింది అని ఆయన ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: