ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏడాది పాలన సందర్భంగా రైతులకు రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. రైతులకు రైతు భరోసా అందించామని చెప్పిన ఆయన... ఏడాది లో 10 వేల కోట్లకు పైగా 49 లక్షల మంది రైతులకు అందించినట్టు వివరించారు.
రైతు కి అండగా ఉండటానికే రైతు భరోసా కేంద్రాలు అని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం రుణమాఫీ పేరుతో మోసం రు. 28 వేల కోట్లు మాఫీ చేస్తానని చెప్పి ఐదేళ్లలో కేవలం 15 వేల కోట్లు కూడా చేయలేదని ఆయన ఆరోపించారు. రైతులకు అన్ని విధాలుగా తమ సర్కార్ అండగా ఉంటుంది అని జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.