మద్యం ధరలను షాక్ కొట్టే విధంగా పెంచామని ఏపీ సిఎం వైఎస్ జగన్ అన్నారు.  ఏడాది పాలనపై ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. రైతులకు రైతు భరోసా అందిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో గుడి దగ్గర బడి దగ్గర కూడా బెల్ట్ షాపులు ఉండేవి అని తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 43 వేలకు పైగా బెల్ట్ షాపులను రద్దు చేసామని, 

 

భారీగా మద్యం ధరలను పెంచామని మద్యం కొనలేని స్థితికి తీసుకుని వచ్చామని అన్నారు. పర్మిట్ రూమ్స్ ని కూడా రద్దు చేసామని... పూర్తిగా భవిష్యత్తులో మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పారు జగన్. పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లో మద్యం లేకుండా చేస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: