దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నా కొందరు ప్రజలు మాత్రం జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. తాజాగా మహారాష్ట్ర రాష్ట్రంలోని థానేలో ఒక మహిళ కరోనా భారీన పడి మృతి చెందింది. 40 ఏళ్ల మహిళ మృతదేహాన్ని ప్యాక్ చేసి బంధువులకు అప్పగించారు. మృతదేహం ప్యాక్ చేసిన బ్యాగ్ ను తెరవకూడదని బంధువులకు సూచించారు. 
 
ప్యాక్ చేసిన బ్యాగ్ ను తెరవడంతో 18 మంది కరోనా భారీన పడ్డారు. అంత్యక్రియల్లో 100 మంది పాల్గొనగా వారిలో 18 మందికి కరోనా నిర్ధారణ అయింది. అంత్యక్రియల్లో పాల్గొన్న వారిలో కొంతమందిని హోం క్వారంటైన్ కు తరలించగా మరికొంతమంది వివరాలు తెలియాల్సి ఉంది. ప్యాక్ చేసిన బ్యాగ్ ను ఓపెన్ చేసి మృతదేహాన్ని తాకడంతో వారికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: