గత రెండు రోజులుగా సోషల్ మీడియా వేదికగా సమంత, పూజా హెగ్డే మధ్య చెలరేగిన వివాదం అంతాఇంతా కాదు. పూజా హెగ్డే త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత అందం గురించి కామెంట్ చేయడం..... ఆ తరువాత తన అకౌంట్ హ్యాక్ అయిందని చెప్పడంత్ తెలిసిందే. అయితే సామ్ గురించి నెగిటివ్ పోస్టులు చేయడంతో సమంత అభిమానులు ఆగ్రహానికి గురై పూజా హెగ్డే సమంతకు సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. 

 

నందినీ రెడ్డి, చిన్మయి కూడా పూజాను టార్గెట్ చేసి సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారు. అయితే తాజాగ సమంత ట్విట్టర్ ద్వారా పూజా పోస్ట్ పై పరోక్షంగా స్పందించారు. పూజా ప్రస్తావన తీసుకురాకుండా ‘మంచి మ‌న‌సులు క‌లిగిన వారిని ఎదుటి వ్య‌క్తులు తెలివిత‌క్కువ వారిగా చూస్తార‌ని’ పోస్ట్ చేశారు. సమంత అభిమానులు, నెటిజన్లు పూజాను ఉద్దేశించి సమంత ఈ పోస్ట్ పెట్టిందని అనుకుంటున్నారు. సామ్ పెట్టిన పోస్ట్ కు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: