క్రికెట్ మ్యాచ్ చూస్తున్న ప్రతీ ఒక్కరికి ఒక సందేహం ఉంటుంది. అసలు ఇది నిజమైన మ్యాచ్ లేదా ఫిక్స్డ్ మ్యాచ్ అని... చాలా మందికి కలిగే సందేహం. ఎప్పుడు అయితే అంతర్జాతీయ క్రికెట్ కి ఐపిఎల్ పరిచయం అయిందో అక్కడి నుంచి క్రికెట్ పై చాలా మందికి అనేక అనుమానాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా బుకీ సంజయ్ చావ్లా కీలక వ్యాఖ్యలు చేసాడు. 

 

రెండు దశాబ్ధాల తర్వాత యూకేలో ఉంటున్న బుకీ సంజీవ్ చావ్లాని ఇండియాకు తీసుకు రాగా... ఏ క్రికెట్ మ్యాచ్ న్యాయంగా జరగదన్నాడు. ప్రతీ మ్యాచ్ ఫిక్స్‌డ్‌ అని సంచలన వ్యాఖ్య చేసారు. ప్రతీ మ్యాచ్ వెనుక ఓ పెద్ద మాఫియా ఉందన్నాడు. ఎవరో డైరెక్ట్ చేసిన సినిమాలా మ్యాచ్‌లు జరుగుతాయన్నాడు. వీటి వెనుక ఉన్నవాళ్లు చాలా ప్రమాదకరమని... మనం ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే.. వాళ్లు ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడరని వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: