ప్రకాశం జిల్లా చీరాల మండలం రామాపురంలో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ వర్గాలు కొట్టుకున్నాయి. దీనితో ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. 

 

ప్రజలు ఎవరూ అనవసరంగా బయటకు రావొద్దని వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇక ఈ ఘర్షణ లో మహిళలు కూడా ఉన్నారు. అయితే ఘర్షణ ఎందుకు జరిగింది అనే దానిపై స్పష్టత లేదు. కొందరి పై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇరు వర్గాల్లో కొందరిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులోనే ఉందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: