హైదరాబాద్ నగరంలోని మేడిపల్లిలో దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులే దొంగలకు సహకరిస్తున్నారు. డీజిల్ చోరీ ముఠాను పోలీసులు పట్టుకోగా వారికి విచారణలో షాకింగ్ విషయాలు తెలిశాయి. ఆరుగురు పోలీసులు ఈ దొంగల ముఠాకు డీజిల్ చోరీలో సహకరిస్తున్నట్టు తేలింది. విషయంలో రాచకొండ సీపీ మహేశ్ భగవత్ దృష్టికి ఆయన వెంటనే ఆరుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. ఎస్.వో.టీ ఇన్ స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్, మరో నలుగురు కానిస్టేబుళ్లపై వేటు వేసినట్టు తెలుస్తోంది. 
 
ఈ నెల 18వ తేదీన మేడిపల్లిలో డీజిల్ చోరీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. దర్యాప్తులో భాగంగా ముఠాను విచారించగా పోలీసుల నిర్వాకం బయటపడింది. విషయం తెలిసిన వెంటనే సీపీ మహేశ్ భగవత్ వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులకే దొంగల ముఠాకు సహకరించిన ఘటన వెలుగు చూడటంతో ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: