గత కొంత కాలంగా అధికార పార్టీ వర్సెస్ ప్రతి పక్ష పార్టీలకు మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన తనయుడు.. టీడీపీ నేతలపై సెటైర్స్ వేస్తూ వస్తున్నారు. తాజాాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా పరోక్ష విమర్శలు గుప్పించారు. బతికినోళ్లను మభ్యపెట్టడానికి పొగడ్తలతో మునగచెట్టు ఎక్కించడాన్ని మనం చూస్తూనే ఉంటామని... 25 ఏళ్ల క్రితం మరణించిన ఎన్టీఆర్ ను భారతరత్న పేరుతో ఆటపట్టించడం... ఆయనకు ఆత్మశాంతి లేకుండా చేయడమేనని చెప్పారు.
'కరోనా కాలంలో కుట్రలు చేయడం ఎలా?' అనే విషయంపై ఎవరైనా మాస్టర్ డిగ్రీ, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, ఆన్ లైన్ కోర్సులను జూమ్ యాప్ ద్వారా చేయాలనుకుంటే... మన నెగెటివ్ థింకింగ్ పితామహుడు గడ్డం బాబును సంప్రదించవచ్చని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దివంగత టీడీపీ నేత ఎన్టీఆర్ ప్రస్తావన ప్రతి వర్ధంతి, జయంతికే గుర్తుకు వచ్చి మాట్లాడుతారు.. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని ప్రతి ఏటా తీర్మానం చేస్తారని... ప్రధానులు, రాష్ట్రపతులను చేశానని చిటికెలేసే వ్యక్తి ఇలా డ్రామాలాడటం నీచాతినీచం అని అన్నారు.
బతికున్నోళ్లను మభ్యపెట్టడానికి పొగడ్తలతో మునగ చెట్టు ఎక్కించడం చూస్తుంటాం. 25 ఏళ్ళ క్రితం మరణించిన ఎన్టీఆర్ ను భారతరత్న పేరుతో ఆటపట్టించడం ఆయనకు ఆత్మశాంతి లేకుండా చేయడమే. ప్రతి ఏటా తీర్మానం చేస్తారు. ప్రధానులు, రాష్ట్రపతులను చేశానని చిటికెలేసే వ్యక్తి ఇలా డ్రామాలాడటం నీచాతినీచం.
— Vijayasai reddy v (@VSReddy_MP) May 30, 2020
కరోనా కాలంలో కుట్రలు చేయడం ఎలా...
— Vijayasai reddy v (@VSReddy_MP) May 30, 2020
అనే విషయంపై ఎవరైనా మాస్టర్ డిగ్రీ/ షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ ఆన్ లైన్ కోర్సులు జూమ్ యాప్ ద్వారా చేయాలనుకుంటే.. మన నెగటివ్ థింకింగ్ పితామహ గడ్డం బాబుని సంప్రదించవచ్చు.