మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత ఏ సినిమా చేస్తాడు అనేది స్పష్టత రావడం లేదు. మహేష్ బాబు ఏ సినిమా చేస్తాడు ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు అంటూ చాలా మంది ఆశగా ఎదురు చూసారు. మహేష్ బాబు సినిమా ప్రకటన కోసం అటు టాలీవుడ్ లో ప్రముఖుల తో పాటు ఇటు అతని అభిమానులు ఎంతో ఎదురు చూసారు.
ఎట్టకేలకు తాను ముందు నుంచి అనుకున్న విధంగానే తన 27 వ సినిమాను పరుశురాం తో చేయడానికి మహేష్ బాబు రెడీ అయ్యాడు. ఈ సినిమా టైటిల్ పై రేపు ఉదయం ప్రకటన వస్తుంది. తాజాగా దీనికి సంబంధించిన ఒక పోస్టర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. రేపు ఉదయం 9 గంటల 9 నిమిషాలకు ప్రకటన రానుంది.
#SSMB27 Official Announcement 🥁
— Team mahesh babu (@MBofficialTeam) May 30, 2020
You've been hearing a lot about it, countdown begins to see the REAL thing 😊
31st May - 9.09 AM 🌠
Super ⭐ @urstrulyMahesh @ParasuramPetla @MythriOfficial @GMBents @14ReelsPlus pic.twitter.com/Z3EwFSpJSP