తెలుగు ఇండస్ట్రీలో మంచ మోహన్ బాబు ముఖ్యపాత్రలో మంచు మనోజ్ హీరోగా నటించిన ‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పొన్ను. తెలుగు లో ఈ అమ్మడు నటించిన చిత్రాలు పెద్దగా సక్సెస్ కాలేదు.. కానీ తాప్సీకి మాత్రం క్రేజ్ తగ్గలేదు. ఆ మద్య బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. వరుస హిట్స్ తో మంచి విజయాలు సాధించింది. తాాజాగా తాప్సీ ఇంట్లో విషదం చోటు చేసుకుంది. తాప్సీ ఎంతో ఇష్టపడే బామ్మ కన్నుమూశారు. తాప్సీ ఈ విషయాన్ని తన అభిమానులతో ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.
గురుద్వారాలో తన బామ్మ అంతిమ సంస్మరణలకు చెందిన ఒక చిత్రాన్ని ఉంచి కుటుంబంలో పాత తరాల వారు ఎప్పటికీ నిలిచపోయే శూన్యాన్ని మనకు వదిలి వెళతారు అని తాప్సీ భావోద్వేగంగా పోస్ట్ పెట్టింది. పింక్, ఘాజీ, బేబీ, నామ్ షబానా వంటి చిత్రాల్లో నటించి తాప్సీ మంచి పేరు తెచ్చుకుంటోంది.
View this post on InstagramThe last of that generation in the family leaves us with a void that will stay forever.... Biji ❤️