మద్యం మత్తులో కొందరు ఏ విధంగా ప్రవర్తిస్తారో కూడా అర్ధం కాదు. మంచి మానవత్వం మరచిపోయి చేసే ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా ఒక ఘటన కడప జిల్లాలో జరిగింది. కడప నగరంలో ఖాదర్ అనే వ్యక్తి మద్యం మత్తులో ఇద్దరి గొంతు కోయడానికి ప్రయత్నం చేసాడు. 

 

వెంటనే అక్కడ పక్కన ఉన్న షాలు అనే వ్యక్తి అడ్డుకోవడానికి ప్రయత్నం చేసాడు. అతని మీద కూడా కత్తితో దాడి చేసాడు. దాడి చేసి పారిపోతూ ఉండగా టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద ఖాదర్ ని పట్టుకున్నాడు. ప్రతీకారంగా ఖాదర్ గొంతుని షాలు కూడా కోసాడు. దీనితో ఖాదర్ పరిస్థితి విషమంగా మారడం తో ఆస్పత్రికి తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: