లాక్ డౌన్ లో ఖాళీ గా ఉండటమో ఏమో గాని కొన్ని చోట్ల విద్యార్ధులు యువకులు రెచ్చిపోతున్నారు. తాజాగా విజయవాడలో విద్యార్ధులు కత్తులతో దాడులు చేసుకున్నారు. విజయవాడ నగరం లోని పటమటలో విద్యార్ధి గ్రూపుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో కర్రలు కత్తులతో వాళ్ళు దాడులు చేసుకున్నారు. నివాస సముదాయాల మధ్యన ఉన్న ఒక గ్రౌండ్ లో ఇది జరిగింది. 

 

అయితే వాళ్ళు ఎందుకు దాడి చేసుకున్నారు అనేది తెలియదు గాని వారి మధ్య క్రికెట్ మ్యాచ్ విషయంలో గొడవ జరిగింది అని అంటున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వీడియో ఆధారంగా పలువురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: