తెలంగాణా కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నా సరే అక్కడ ఆధిపత్య పోరు మాత్రం ఆగడం లేదు. ఎంపీ రేవంత్ రెడ్డి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అని తనను అడిగితే ఇవ్వొద్దు అని చెప్తా అని.... తన ఫిర్యాదులు అన్నీ కూడా నేరుగా రేవంత్ కే చెప్తా అన్నారు. 

 

వచ్చే ఎన్నికల్లో ఉత్తమ నాయకత్వంలోనే తాము ఎన్నికలకు వెళ్తామని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఉత్తమ కుమార్ రెడ్డిని మార్చవద్దు అని రాహుల్ కి లేఖ రాస్తా అన్నారు. కొంత మంది ఫేస్బుక్ లో రెచ్చిపోతున్నారని ఆయన మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: