తెలంగాణాలో లాక్ డౌన్ ని జూన్ 30 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది తెలంగాణా సర్కార్. కరోనాపై లాక్ డౌన్ పై సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకున్నారు. అంతరాష్ట్ర రాకపోకలకు అనుమతి ఇస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగిస్తారు. 

 

ఇప్పటికే నిన్న కేంద్రం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణం గానే తెలంగాణ సర్కార్ కూడా నిర్ణయం తీసుకుంది. అంతరాష్ట్ర రవాణా పై  కేంద్రం ఏ విధంగా అయితే నిషేధం ఎత్తివేసిందో తెలంగాణా కూడా అదే విధంగా ఎత్తేస్తూ నిర్ణయం తీసుకున్నారు సిఎం కేసీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: