ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో ఏ స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంది అనే విషయం అందరికి తెలిసిందే. చిన్న చిన్న ఉద్యోగాల విషయంలో కూడా భద్రత కల్పించే ప్రయత్నం జగన్ సర్కార్ సమర్ధవంతంగా చేసింది. ఆర్టీసి ఉద్యోగులు సహా వాలంటీర్ల విషయంలో ఇదే జరిగింది. దీనిపై తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో కీలక వ్యాఖ్యలు చేసారు. 

 

జగన్ గారు సీఎంగా బాధ్యతలు స్వీకరించాక నిరుద్యోగులకు మనో ధైర్యం కల్పించారని ఆయన అన్నారు. ప్రతి ఏటా ఉద్యోగ నియామకాలుంటాయని భరోసా ఇచ్చారన్నారు. 4 లక్షల మందికి ఉద్యోగాలిచ్చారు. 52 వేల మంది ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలోకి తీసుకున్నారని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: