తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఫ్రీ జిల్లాల్లో ఖమ్మం ఒకటి. అక్కడ అసలు కేసులు ముందు నుంచి కూడా చాలా తక్కువగా నమోదు అవుతూ వస్తున్నాయి. కరోనా కట్టడి విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించారు కూడా అక్కడి అధికారులు. దీనితో కేసులు అసలు లేవు అనే అనుకున్నారు అందరూ... కాని అక్కడ తాజాగా చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు అనూహ్యంగా కేసులను పెంచాయి.
ఇక అక్కడ నేలకొండపల్లి మండల కేంద్రమైన నేలకొండపల్లి గ్రామాన్నికంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు అధికారులు. 14 రోజులపాటు నేలకొండపల్లి... కంటైన్మెంట్ జోన్గా ఉంటుందని అక్కడి అధికారులు తెలిపారు. అక్కడ నేటి నుంచి కూడా పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ని అమలు చేస్తారు. ప్రజలు ఎవరూ కూడా బయటకు రావొద్దు అని చెప్పారు.